Telugu Global
Andhra Pradesh

ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం.. జగన్ బస్సు యాత్ర

యాత్రలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక రాత్రి జగన్ అక్కడే బస చేస్తారు. స్థానిక ప్రజలు, మేధావులతో సమావేశమై స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చిస్తారు.

ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం.. జగన్ బస్సు యాత్ర
X

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌.. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు జగన్‌ సిద్ధమయ్యారు. `మేమంతా సిద్ధం` పేరుతో ఈ బస్సు యాత్రలు నిర్వహించనున్నారు.


మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభలు నిర్వహిస్తారు. ఈ సభల్లో పార్టీ అధినేత జగన్ పాల్గొంటారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి మంగళవారం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

యాత్రలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక రాత్రి జగన్ అక్కడే బస చేస్తారు. స్థానిక ప్రజలు, మేధావులతో సమావేశమై స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చిస్తారు.

First Published:  18 March 2024 10:57 AM GMT
Next Story