Telugu Global
Andhra Pradesh

‘వ్యూహం’కి వైసీపీ ఫుల్‌ సపోర్ట్‌..

దర్శకుడు వర్మ తన చిత్రానికి ప్రీ రిలీజ్‌ వేడుక కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు రోజా, జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పార్టీ నేత గౌతంరెడ్డి తదితరులు హాజరై ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు.

‘వ్యూహం’కి వైసీపీ ఫుల్‌ సపోర్ట్‌..
X

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తాజాగా రూపొందించిన పూర్తి పొలిటికల్‌ చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదల కాగా, అందులో ఉన్న కంటెంట్‌ అంతా తమకు వ్యతిరేకంగానే ఉందంటూ టీడీపీ పెద్దలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ చిత్రం విడుదలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు వర్మ తన చిత్రానికి ప్రీ రిలీజ్‌ వేడుక కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు రోజా, జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పార్టీ నేత గౌతంరెడ్డి తదితరులు హాజరై ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్‌ వేడుక ఫుల్లుగా పొలిటికల్‌ కామెంట్లతో నిండిపోయింది. డిసెంబర్‌ 29న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ప్రమోషన్లు ఇప్పటికే జరుగుతుండగా, ప్రీ రిలీజ్‌ వేడుకకు వైసీపీ నేతలు హాజరై దీనిపై ప్రజల్లో మరింత చర్చ జరిగేలా చేశారు.

ఇక వేడుకలో మంత్రి రోజా మాట్లాడుతూ.. దర్శకుడు వర్మను ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం అని తెలిపారు. ఇక ఈ సినిమా టైటిల్‌ ప్రకటించగానే సైకిల్‌ పార్టీ షేకై పోయిందని చెప్పారు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారని, అయితే ’వ్యూహం’ చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరని మంత్రి రోజా స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ.. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని, సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ అని తెలిపారు. ’వ్యూహం’ విషయంలో చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని చెప్పారు. ముంబై మాఫియాకే ఆర్జీవీ భయపడలేదు.. మీకు భయపడతారనుకుంటున్నారా? అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు.

First Published:  24 Dec 2023 3:36 AM GMT
Next Story