Telugu Global
Andhra Pradesh

బాబుతో ఆనం భేటీ.. టీడీపీ నేతలకు బ్రేక్‌ఫాస్ట్

హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడుతో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగింది. అనంత‌రం హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు ఆనం వెళ్లారు.

బాబుతో ఆనం భేటీ.. టీడీపీ నేతలకు బ్రేక్‌ఫాస్ట్
X

వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని శుక్రవారం ఆనం హైదరాబాద్‌లో కలిశారు. దాదాపు గంట పాటు వీరి భేటీ జరిగింది. ఇప్పటికే వైసీపీ నుంచి స‌స్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు చేశారన్న ఉద్దేశంతో వైసీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఇప్పుడు హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడుతో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగింది. అనంత‌రం హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు ఆనం వెళ్లారు. టీడీపీ నేత సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులకు బ్రేక్ ఫాస్ట్‌ కోసం ఆనం తన ఇంటికి ఆహ్వానించారు. బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత టీడీపీ నేతలతో కలిసి ఆనం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. లోకేష్ పాదయాత్ర నెల్లూరులోకి ఎంటరయ్యే సమయంలో స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నారు.

ఇప్పటికే లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లను ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్యే పదవికి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారా..? లేక తనను సస్పెండ్ చేశారు కాబట్టి రాజీనామా అవసరం లేదంటారా..? అన్నది చూడాలి.

First Published:  10 Jun 2023 2:56 AM GMT
Next Story