Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణకు కృతజ్ఞతలు- విజయసాయిరెడ్డి

గుండె ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. మెదడుకు సంబంధించిన సమస్య తప్ప మరేమీ లేదన్నారు. రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోకి నీరు చేరి వాపు వచ్చిందన్నారు.

బాలకృష్ణకు కృతజ్ఞతలు- విజయసాయిరెడ్డి
X

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. విజయసాయిరెడ్డి మరదలు కుమార్తె అలేఖ్య‌రెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నారు. పరామర్శ అనంత‌రం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తార‌క‌ర‌త్న‌కు గుండెపోటు వచ్చిన సమయంలో 40 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. దాంతో మెదడులోని పైభాగం కొద్దిమేర దెబ్బతిన్నదని అయినా పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు.

గుండె ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. మెదడుకు సంబంధించిన సమస్య తప్ప మరేమీ లేదన్నారు. రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోకి నీరు చేరి వాపు వచ్చిందన్నారు. ఆ వాపు తగ్గడానికి మూడు నాలుగు రోజుల స‌మ‌యం పడుతుందని వైద్యులు చెప్పారని.. ఇప్పటికే నాలుగు రోజులు గడిచినందున రేపటి నుంచి మెదడు పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్నారు.

వైద్యులు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారని.. హీరో నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తూ, అన్ని విషయాలను చూసుకుంటున్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.

First Published:  1 Feb 2023 2:47 PM GMT
Next Story