Telugu Global
Andhra Pradesh

ఏపీ బీజేపీకి "బావ"సారూప్యత సమస్య

కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌ ద్వారా చంద్రబాబు.. ఇండియా కూటమికి దగ్గరవుతున్న విషయం బీజేపీ అధిష్టానానికి తెలుసని విజయ సాయి రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ బీజేపీకి బావసారూప్యత సమస్య
X

స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభ‌కోణంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు అరెస్టుతో ఏపీలో అధికార, విప‌క్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించిన తీరుపై ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం పురందేశ్వరిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఏపీ బీజేపీకి 'బావ' సారూప్యత సమస్య ఉత్పన్నమైందంటూ ట్వీట్‌ చేశారు.


విజయ సాయి రెడ్డి ఏమని ట్వీట్ చేశారంటే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగి ఉంటే పురందేశ్వరిలా అవినీతి పరులకు మద్దతు పలికేవారు కాదని, తెలుగుదేశం పార్టీ బలహీనతను వీర్రాజు బీజేపీకి అనుకూలంగా మార్చుకునేవారంటూ ట్వీట్ చేశారు. అలాగే బీజేపీకి 'బావ' సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేదే కాదంటూ చురకలు అంటించారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌ ద్వారా చంద్రబాబు.. ఇండియా కూటమికి దగ్గరవుతున్న విషయం బీజేపీ అధిష్టానానికి తెలుసని విజయ సాయి రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై పురందేశ్వరి స్పందించిన తీరుపై సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

First Published:  13 Sep 2023 5:43 PM GMT
Next Story