Telugu Global
Andhra Pradesh

నోటాతోనే కాంగ్రెస్‌ పోటీ.. ఆ పార్టీకి ఓటు వృథా

ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితిపై ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఏపీలో ఐదో స్థానం కోసం నోటాతో కలిసి కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు.

నోటాతోనే కాంగ్రెస్‌ పోటీ.. ఆ పార్టీకి ఓటు వృథా
X

షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్‌కు కాస్త మీడియా కవరేజ్ పెరిగింది. అంతే కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఏ మాత్రం సీన్‌ లేదు. ఏపీకి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఇక షర్మిల సైతం చంద్రబాబు పాడుతున్న పాటనే వినిపిస్తూ కొంత హడావుడి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితిపై ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఏపీలో ఐదో స్థానం కోసం నోటాతో కలిసి కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా చేతిలో 32 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిందంటూ సెటైర్లు వేశారు.

గతంలో మధ్యప్రదేశ్‌, గోవా, కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపోయిన తీరు కళ్లముందే ఉందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే వృథానే అన్నారు. అందుకే గెలిచే పార్టీకే.. అది వైఎస్సార్సీపీకే వేయాలంటూ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

First Published:  23 Feb 2024 7:02 AM GMT
Next Story