Telugu Global
Andhra Pradesh

అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతి!

Challa Bhageerath Reddy Died: వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్ను మూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు.

అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతి!
X

వైఎస్సార్ సీపీ నాయకుడు, ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్ను మూశారు. 46 ఏళ్ళ భగీరథ రెడ్డి కొంత కాలంగా న్యుమోనియాతో పోరాడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. రేపు ఆయన స్వస్థలమైన అవుకులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

భగీరథ‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. భగీరథ రెడ్డి తన తండ్రితో కలిసి 2019 లో వైసీపీలో చేరారు. అంతకు ముందు ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. రామకృష్ణా రెడ్డి మృతి చెందిన తర్వాత భగీరథ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సి టిక్కట్ ఇచ్చింది. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం ఏ పొలిటికల్ సైన్స్ చేశారు.

First Published:  2 Nov 2022 12:23 PM GMT
Next Story