Telugu Global
Andhra Pradesh

5 లక్షలు తీసుకుని జగన్‌ను వాడు, వీడు అంటావా..? - టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే ఫైర్

నీటి పంప్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆమె భర్తను ఉద్యోగం నుంచి తీసివేయించారు. ఈ విషయాన్ని మీడియా ముందు ప్రసన్నకుమార్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.

5 లక్షలు తీసుకుని జగన్‌ను వాడు, వీడు అంటావా..? - టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే ఫైర్
X

సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వాడువీడు అంటూ మాట్లాడిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడేళ్లలో 5లక్షల 19వేల రూపాయలు తీసుకున్న వ్యక్తి.. సీఎంను ఉద్దేశించి వాడువీడు అంటూ మాట్లాడడం ఏమిటని ఫైర్ అయ్యారు. టీడీపీ నిర్వహించిన ''ఇదేం ఖర్మ రాష్ట్రానికి'' అనే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యలక్ష్మీ అనే స్థానిక మహిళ అక్కడే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకున్నా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి.. నీటి పంప్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆమె భర్తను ఉద్యోగం నుంచి తీసివేయించారు. ఈ విషయాన్ని మీడియా ముందు ప్రసన్నకుమార్ రెడ్డే స్వయంగా వెల్లడించారు. తానే అధికారులను ఫోన్ చేసి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలోకి తీసుకోవద్దని చెప్పానన్నారు.

మూడేళ్లలో 5 లక్షల 19వేలు పథకాల రూపంలో తీసుకుని కూడా సీఎంను ఉద్దేశించి వాడువీడు అంటూ మాట్లాడుతారా.. పిచ్చిపిచ్చిగా ఉందా అని రాజ్యలక్ష్మీని ఉద్దేశించి ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. తాను తలుచుకుంటే ఒక్క పథకం కూడా రాకుండా చేయగలనని.. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మారాలన్నారు. వాడెవడో టీడీపీ వాడు ఇంటి వద్దకు వస్తే సీఎంను ఇష్టానుసారం మాట్లాడుతావా అంటూ ప్రశ్నించారు. సీఎంను దూషిస్తే అంతుతేలుస్తా.. స్వయంగా నేను మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటా అంటూ వార్నింగ్ ఇచ్చారు. మనిషి అన్న తర్వాత కొద్దిగానైనా నిజాయితీ ఉండాలి కదా అని ఎమ్మెల్యే నిలదీశారు.

First Published:  5 Dec 2022 11:41 AM GMT
Next Story