Telugu Global
Andhra Pradesh

పప్పు ధాన్యాల పేర్లు చెప్పలేని పప్పుగాడు

ఒంటరిగా నడవలేక మరొకరితో పొత్తు పెట్టుకునే స్థితిలో ఉన్న వారెక్కడ.. సింహంలా సింగిల్‌గా వస్తున్న జగన్‌ ఎక్కడ..? అని ప్రశ్నించారు.

పప్పు ధాన్యాల పేర్లు చెప్పలేని పప్పుగాడు
X

పప్పుధాన్యాలన్నీ తెచ్చి ముందుపెడితే వాటి పేర్లు కూడా చెప్పలేని పప్పుగాడు అంటూ నారా లోకేష్‌ను ఉద్దేశించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. పప్పు ధాన్యాల పేర్లు చెప్పలేని పప్పుగాడు.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా..? అని ఎద్దేవా చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజాసంక్షేమ యాత్ర ముగింపు కార్యక్రమానికి వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే.. ఒంటరిగా నడవలేక మరొకరితో పొత్తు పెట్టుకునే స్థితిలో ఉన్న వారెక్కడ.. సింహంలా సింగిల్‌గా వస్తున్న జగన్‌ ఎక్కడ..? అని ప్రశ్నించారు. జగన్‌ను విమర్శించే ముందు వారి స్థాయిలు తెలుసుకోవాలన్నారు.

జేసీ బ్రదర్స్ దొంగ బస్సులు, దొంగ లారీలు తిప్పుకుంటూ నీచమైన బతుకులు బతుకుతున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. ఇలాంటి గజదొంగల ఫొటోలను పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో అతికించాలని.. ఆ పని చేయకపోవడం వల్లనే జేసీ సోదరులు పదేపదే పోలీసుల మీదకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. జేసీ సోదరుల వద్దకు ఎవరైనా మంచి బట్టలేసుకుని వెళ్లినా చూసి ఓర్వలేరన్నారు.

వచ్చేసారి వైసీపీ గెలిస్తే జేసీ బ్రదర్స్ అడుక్కుతినాల్సిందేనన్నారు. డ్యాంలో పడి జేసీ ప్రభాకర్ రెడ్డి చస్తే పీడపోతుందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద రౌడీ అని చెప్పుకుంటున్నారని.. వాళ్లే కాదూ తామూ పెద్ద రౌడీలమేనన్ని పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జేసీ సోదరులపై ఉన్న కేసుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో ఎస్పీ ఆఫీస్‌ ముందు తానే ధర్నా చేస్తానని పెద్దారెడ్డి ప్రకటించారు.

First Published:  9 Feb 2023 3:28 AM GMT
Next Story