Telugu Global
Andhra Pradesh

షాకిచ్చిన‌ కేతిరెడ్డి.. తినే అన్నంలో రాయేసుకున్న టీడీపీ కార్యకర్త

పథకాలకు సంబంధించిన ఫైల్ చదివిన ఎమ్మెల్యే.. దాన్ని ఇవ్వబోగా శివయ్య తీసుకోలేదు. నీ పథకాలు అవసరం లేదంటూ మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే కేతిరెడ్డి ఊరుకోలేదు. అక్కడే ఉన్న వలంటీర్‌ను పిలిచారు.

షాకిచ్చిన‌ కేతిరెడ్డి.. తినే అన్నంలో రాయేసుకున్న టీడీపీ కార్యకర్త
X

ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి షాక్ ఇవ్వాలనుకున్న టీడీపీ కార్యకర్తకు తిరిగి ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి.. తాడిమర్రి మండలం ఎం.ఆగ్రహారంలో పర్యటించారు. ఎమ్మెల్యే వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ కార్యకర్త శివయ్య తన ఇంటి మీద టీడీపీ జెండా కట్టారు. దాన్ని చూసిన ఎమ్మెల్యే.. మేం వస్తున్నామని జెండా కట్టావా అంటూ వ్యాఖ్యానించారు.

పథకాలకు సంబంధించిన ఫైల్ చదివిన ఎమ్మెల్యే.. దాన్ని ఇవ్వబోగా శివయ్య తీసుకోలేదు. నీ పథకాలు అవసరం లేదంటూ మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే కేతిరెడ్డి ఊరుకోలేదు. అక్కడే ఉన్న వలంటీర్‌ను పిలిచారు. వలంటీర్‌ను ఉద్దేశించి ఏమ్మా?.. వాళ్లు వద్దు అని అంతగా చెబుతుంటే.. పథకాలు అవసరం లేదని చెబుతుంటే.. మరి ఎందుకు వారి పేర్లను పెడుతున్నారు. వాళ్లు చూడు వద్దన్నా పథకాలు ఇస్తున్నందుకు ఎంతగా బాధపడుతున్నారో!. కాబట్టి ఇకపై వారికి ఏ పథకాలు ఇవ్వొద్దు. ఇచ్చి బాధపెట్టవద్దు అని చెప్పేశారు.

ఇంతలో శివయ్య తండ్రి కేతిరెడ్డి దగ్గరకు వచ్చి ఏదో బతిమలాడబోయారు. కానీ ఎమ్మెల్యే శాంతించలేదు. మీవాడు వద్దన్నాడు కదా.. ఇక వెళ్లండి అని తేల్చేశారు. దాంతో చుట్టుపక్కల వాళ్లు.. టీడీపీ కార్యకర్తను చూసి పౌరుషానికి పోయి తినే అన్నంతో రాయేసుకున్నారని నవ్వుకున్నారు.

First Published:  1 Oct 2022 9:35 AM GMT
Next Story