వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేను- వైసీపీ ఎమ్మెల్యే
తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరానని.. అందుకు సర్వే చేసి నిర్ణయానికి వస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.
BY Telugu Global25 Nov 2022 1:43 AM GMT
X
Telugu Global Updated On: 25 Nov 2022 1:43 AM GMT
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రకటించారు. వన భోజనాల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారని, కానీ తాను పోటీ చేయలేనని చెప్పానన్నారు. తన వయసు 83ఏళ్లు అని, గుండె జబ్బు కూడా ఉందని, ఎక్కువ సేపు మాట్లాడడం, తిరగడం కూడా చేయలేకపోతున్నానని సీఎంకు వివరించానని చెన్నకేశవరెడ్డి చెప్పారు.
తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరానని.. అందుకు సర్వే చేసి నిర్ణయానికి వస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సర్వే రిపోర్టు కూడా సీఎంకు అందిందని.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇస్తే అందరూ సహకరించాలని చెన్నకేశవ రెడ్డి కోరారు.
Next Story