Telugu Global
Andhra Pradesh

ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులు

చంద్రబాబుకు అభివృద్ధిపాలన అందించడం తెలుసా?. అదే చేతనైతే ఐదేళ్లలో ఎందుకు ఏం చేయలేకపోయారు?. వాలంటీర్ వంటి వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయారు?.

ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులు
X

టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు వైసీపీ మహిళానేత వాసిరెడ్డి పద్మ. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. "సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారు. మంగళగిరి వైసీపీ నేత వెంకటరెడ్డిని గుద్ది చంపేశారు. వైసీపీ నాయకులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటేనే పదవులని లోకేష్ రెచ్చగొడుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు".

"చంద్రబాబుకు అభివృద్ధిపాలన అందించడం తెలుసా?. అదే చేతనైతే ఐదేళ్లలో ఎందుకు ఏం చేయలేకపోయారు?. వాలంటీర్ వంటి వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయారు?. పేదలకు ఉచిత విద్య ఎందుకు అందించలేకపోయారు?. మెరుగైన వైద్యం ఎందుకు అందించలేదు?. నా పాలన చూసి ఓటేయమని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నాడు?. జగన్ మోహన్ రెడ్డిని బూచీగా చూపించాలని చూస్తున్నారు. కానీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. కూటమిని చూసి ఓటేయమని మీరంటే.. మంచి జరిగితేనే ఓటేయమని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచే కాదు.. టీడీపీ నుంచి కూడా స్పందన రావడం లేదు. ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోయింది. అందుకే విద్వేషాన్ని విరజిమ్ముతున్నాడు" అని తీవ్రస్థాయిలో విమర్శించారు వాసిరెడ్డి పద్మ.

First Published:  20 April 2024 9:04 AM GMT
Next Story