Telugu Global
Andhra Pradesh

వారిద్ద‌రినీ రాజ‌కీయంగా త‌రిమికొట్టండి.. - నంద‌మూరి ఫ్యాన్స్‌కు ల‌క్ష్మీపార్వ‌తి పిలుపు

నందమూరి అభిమానులంతా కలిసి చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయంగా తరిమికొట్టాలని సూచించారు. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలన్నారు.

వారిద్ద‌రినీ రాజ‌కీయంగా త‌రిమికొట్టండి.. - నంద‌మూరి ఫ్యాన్స్‌కు ల‌క్ష్మీపార్వ‌తి పిలుపు
X

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నంద‌మూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి అభిమానులంతా కలిసి చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీని నందమూరి కుటుంబానికి తిరిగి అప్పగించాలన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2019లోనే చంద్రబాబు చాప్టర్ ముగిసిందన్నారు. కాబట్టి చంద్రబాబు, ఆయన పుత్రుడు లోకేష్, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.

నారా లోకేష్ ని ఎన్టీఆర్ మనవడిగా ప్రజలు స్వీకరించడం లేదని చెప్పారు. అయినా చంద్రబాబు కోట్లు ఖర్చుపెట్టి లోకేష్ కు భాష నేర్పించాడన్నారు. అయినా అతడిలో మార్పు రావడం లేదన్నారు. అదే అయోమయం కనిపిస్తోందని విమర్శించారు.

ఈ అయోమయంతోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు లోకేష్ విమర్శలు చేస్తున్నాడని చెప్పారు. నందమూరి అభిమానులంతా కలిసి చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయంగా తరిమికొట్టాలని సూచించారు. టీడీపీని తిరిగి నందమూరి కుటుంబానికి అప్పగించాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి రాకముందే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా.. అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. సినిమాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను చంద్ర‌బాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చి అతడితో కాపులను తిట్టిస్తున్నాడని చెప్పారు. విషవృక్షం నీడలో రాజకీయాలు చేయవద్దని గతంలోనే పవన్ కళ్యాణ్ కు చెప్పానని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. అమ్ముడుపోయే నాయకులు అన్ని పార్టీలలో ఉంటారని, అలాంటి చీడపురుగులు బయటకు వెళ్లిపోయినప్పుడే వైసీపీ మరింత బలోపేతం అవుతుందని ఆమె చెప్పారు.

First Published:  27 Jun 2023 10:48 AM GMT
Next Story