Telugu Global
Andhra Pradesh

పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్‌ సిద్ధం..

ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన.. బీజేపీలో విలీనమవుతాయని నాని చెప్పారు. సీఎం జగన్‌ పాలనతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌కు అండగా నిలుస్తారని తెలిపారు.

పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్‌ సిద్ధం..
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఓడిపోవడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నాడని నాని చెప్పారు. అందుకే అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత లక్ష ఓట్ల మెజారిటీతో పవన్‌పై గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన.. బీజేపీలో విలీనమవుతాయని నాని చెప్పారు. సీఎం జగన్‌ పాలనతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌కు అండగా నిలుస్తారని తెలిపారు. చిలకలూరిపేటలో మూడు పార్టీల కూటమి నిర్వహించిన సభకు 15 లక్షల మంది జనం వస్తారని గొప్పలు చెప్పారని, తీరా చూస్తే లక్ష మంది కూడా రాలేదని కేశినేని నాని ఎద్దేవా చేశారు. సిద్ధం సభలను చూసి చంద్రబాబు, పవన్‌లలో భయం పట్టుకుందన్నారు.

చిలకలూరిపేట ప్రజాగళం సభకు ప్రధాని మోడీని పిలిచి తీవ్రంగా అవమానించారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రధానికి శాలువా కూడా వేయలేని స్థితిలో చంద్రబాబు, పవన్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. భాషలపై పట్టులేని చంద్రబాబు.. మోడీ ప్రసంగాన్ని వచ్చీరాని విధంగా చెప్పారని దుయ్యబట్టారు.

First Published:  21 March 2024 5:06 AM GMT
Next Story