Telugu Global
Andhra Pradesh

అన్‌స్టాపబుల్, నిజం షోలు అయిపోయాయి.. తర్వాత జబర్దస్తా..? బాబుపై వైసీపీ ఫైర్

ఇటీవల మరో ఓటీటీ అయిన సోనీ లివ్ లో సింగర్ స్మిత హోస్ట్ గా ప్రసారం అవుతున్న నిజం అనే షోకు చంద్రబాబు హాజరయ్యారు. ఓటీటీల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబుపై వైసీపీ కౌంటర్ వేసింది

అన్‌స్టాపబుల్, నిజం షోలు అయిపోయాయి.. తర్వాత జబర్దస్తా..? బాబుపై వైసీపీ ఫైర్
X

చంద్రబాబు రాజకీయాలన్నీ జనం మధ్య కంటే మీడియా మధ్యే సాగుతుంటాయన్న విమర్శ ఉంది. ఆయన అధికారంలోకి రావడానికి ఆయన కన్నా ఆయన వెంట నడుస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్లు తెగ ఆరాటపడుతుంటాయి. జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. మొన్న గన్నవరం ఎపిసోడ్లో అబద్ద‌పు వార్తలు ప్రచురించి దొరికిపోయినా ఎల్లో మీడియా బురదజ‌ల్లుడు కార్యక్రమం కొనసాగిస్తుంటాయి.

ఇప్పటికే చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నో పత్రికలు, టీవీ ఛానళ్లు పనిచేస్తున్నాయి. ఇది చాలక ఇటీవల ఆహా ఓటీటీని కూడా రాజకీయాలకు వాడుకున్నారు చంద్రబాబు. అన్ స్టాపబుల్ షోకు తనయుడితో కలిసి చంద్రబాబు హాజరయ్యాడు.

ఇటీవల మరో ఓటీటీ అయిన సోనీ లివ్ లో సింగర్ స్మిత హోస్ట్ గా ప్రసారం అవుతున్న నిజం అనే షోకు చంద్రబాబు హాజరయ్యారు. ఓటీటీల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబుపై వైసీపీ కౌంటర్ వేసింది. ఈ మేరకు వైసీపీ డిజిటల్ మీడియా ఒక ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ హుందాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటే చంద్రబాబు మాత్రం అయినోళ్లు, కులపోళ్ల టీవీ షోలకు హాజరవుతూ తనస్థాయిని దిగదార్చుకుంటున్నాడని విమ‌ర్శించింది. చివరకు తన రాజకీయాల కోసం జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు హాజరైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సెటైర్ వేసింది.

'జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హుందాగా జగనన్న. బామ్మర్ది, కులమ్మ టీవీ షోలల్లో దిగజారిపోతున్న చంద్రబాబు. త్వరలో జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు గెస్ట్ గా వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు' అని వైసీపీ డిజిటల్ మీడియా ట్వీట్ చేసింది.

First Published:  24 Feb 2023 4:06 PM GMT
Next Story