Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్‌కి జ్వ‌రం కాదా..? బ్రో సినిమా డ‌బ్బింగ్ కోసమే ఆ సాకు చెప్పారా..?

102 డిగ్రీల జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్రాంతి తీసుకోకుండా డ‌బ్బింగ్ చెప్ప‌డ‌మేంట‌ని ఆరా తీస్తే.. బ్రో సినిమా డ‌బ్బింగ్ కోస‌మే.. అస్వ‌స్థ‌త డ్రామా ఆడారంటూ సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది.

ప‌వ‌న్‌కి జ్వ‌రం కాదా..? బ్రో సినిమా డ‌బ్బింగ్ కోసమే ఆ సాకు చెప్పారా..?
X

వారాహి పేరుతో ఇటీవ‌ల తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌ట‌న ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అక్క‌డి నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు ఆ పార్టీ శ్రేణులు వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలో న‌ర‌సాపురం స‌భ త‌ర్వాత భీమ‌వ‌రం చేరుకున్న ప‌వ‌న్‌.. అక్క‌డ స‌మావేశం అనంత‌రం జ్వ‌రం పేరుతో వారాహి యాత్ర‌కు బ్రేక్ ఇచ్చారు. ఆయ‌న 102 డిగ్రీల జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు వెల్ల‌డించారు. జ్వ‌రం కార‌ణంగా భీమ‌వ‌రంలోనే విశ్రాంతి తీసుకుంటార‌ని, ఈ నెల 30న భీమ‌వ‌రంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

సీన్ క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బ్రో` ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని బుధ‌వారం భీమ‌వ‌రం వ‌చ్చారు. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. `బ్రో` సినిమాకు సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బ్బింగ్ వ‌ర్క్స్ పెండింగ్‌లో ఉందంట‌. అందుకే బుధ‌వారం సినిమా డ‌బ్బింగ్ ప‌నిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స‌ముద్ర‌ఖ‌ని బిజీగా ఉన్నారు.

102 డిగ్రీల జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్రాంతి తీసుకోకుండా డ‌బ్బింగ్ చెప్ప‌డ‌మేంట‌ని ఆరా తీస్తే.. బ్రో సినిమా డ‌బ్బింగ్ కోస‌మే.. అస్వ‌స్థ‌త డ్రామా ఆడారంటూ సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. సినిమాలు, రాజ‌కీయాలు బ్యాలెన్స్ చేయ‌లేక ప‌వ‌న్ స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని కామెంట్ చేస్తున్నారు. డ‌బ్బింగ్ కోస‌మే బ‌స్సు యాత్ర‌కు బ్రేక్ ఇచ్చాడని, ఆ విష‌యాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేక‌.. జ్వ‌ర‌మంటూ డ్రామాలాడుతున్నాడ‌ని వైసీపీ నుంచి కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.

First Published:  29 Jun 2023 5:41 AM GMT
Next Story