Telugu Global
Andhra Pradesh

రజినీని పూర్తిగా 'చంద్ర'ముఖిలా మార్చేశారా..?

బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుకోసం రజినీ కూడా రాయబారం నడుపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

రజినీని పూర్తిగా చంద్రముఖిలా మార్చేశారా..?
X

ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. చంద్రబాబుని పొగిడి వైసీపీ నేతలకు శత్రువయ్యారు. ఆ మాటకొస్తే అప్పటి వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో కూడా రజినీ పాత్ర ఉందని పాత ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే నేరుగా ఎప్పుడూ రజినీకాంత్ చంద్రబాబుకోసం ప్రచారం చేయలేదు, మరీ అంతగా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. 2024 ఎన్నికలనాటికి మాత్రం రజినీకాంత్ తో చంద్రబాబు ఏదో ఒక ప్రయోగం చేయబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల స్పీచ్ తర్వాత రజినీకాంత్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. కనీసం వైసీపీ నేతలకు ఆయన కౌంటర్లు కూడా ఇవ్వలేదు. తమిళనాడు వెళ్లి మరీ రజినీకి మంత్రి రోజా చీవాట్లు పెట్టినా అభిమానులు హర్ట్ అయ్యారు కానీ, రజినీవైపు నుంచి స్పందన లేదు. అయితే మళ్లీ ఇప్పుడు ఆయన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కలసి కనపడటం సంచలనంగా మారింది.


ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబుకోసం జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోకూడా ఆయన ప్రముఖంగా కనిపించారు. రజినీకాంత్ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రజినీతో రఘురామ తీసుకున్న ఫొటోల్ని ట్విట్టర్లో రిలీజ్ చేశారు. తలైవాతో చర్చలు ఇప్పుడే ముగిశాయని కూడా చెప్పారు. అంటే బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుకోసం రజినీ కూడా రాయబారం నడుపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అదే నిజమైతే.. ఈసారి రజినీకాంత్ ని చంద్రబాబు ఓ రేంజ్ లో వాడుతున్నట్టు లెక్క. పనిలో పనిగా ఏపీలో కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్ గా సూపర్ స్టార్ ని బరిలో దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

First Published:  5 Jun 2023 5:05 PM GMT
Next Story