ఏపీ సీఎం జగన్తో వాట్సాప్ డైరెక్టర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్, సివిక్ ఎంగేజ్మెంట్స్ ప్రాంతీయ అధికారి నిఖిల్ ఆప్టేలు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిద్దరూ సీఎం జగన్ను కలిశారు.
BY Telugu Global10 Sep 2022 11:00 AM GMT
X
Telugu Global Updated On: 10 Sep 2022 11:00 AM GMT
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్, సివిక్ ఎంగేజ్మెంట్స్ ప్రాంతీయ అధికారులు భేటీ అయ్యారు. గతంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వాట్సప్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ప్రతినిధులు భేటీ అయి వుంటారని తెలుస్తోంది. వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ థుక్రాల్, సివిక్ ఎంగేజ్మెంట్స్ ప్రాంతీయ అధికారి నిఖిల్ ఆప్టేలు సీఎం జగన్తో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిద్దరూ సీఎం జగన్ను కలిశారు. ఈ భేటీలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా కొనసాగుతున్న చిన్న వాసుదేవరెడ్డి కూడా పాల్గొన్నారు.
Next Story