Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కౌంటర్లు షురూ.. 6 నెలల గ్యాప్ తర్వాత

వాస్తవానికి విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడేదాని కంటే ట్విట్టర్‌లోనే ఎక్కువగా తన గళం వినిపిస్తుంటారు. నారా లోకేష్‌ని తరచూ పప్పు, చిట్టి నాయుడు అంటూ వెటకారం చేసే విజయసాయి రెడ్డి చంద్రబాబుని చంబా అంటూ వెక్కిరిస్తూ ట్వీట్‌లు చేసేవారు.

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కౌంటర్లు షురూ.. 6 నెలల గ్యాప్ తర్వాత
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరెత్తగానే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంతెత్తునలేస్తారు. ఈ ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు ఏం మాట్లాడినా.. దానికి కౌంటర్‌గా విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో స్పందించేవారు. ఈ క్రమంలో ఒకరినొకరు రాజకీయాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ దూషించుకునే వరకూ వెళ్లింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు యథేశ్చ‌గా బూతులు వాడేశారు. కానీ స్పష్టమైన కారణం వెలుగులోకి రాలేదుగానీ.. ఎందుకో విజయసాయి రెడ్డి ఆరు నెలలు పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఇటీవల మహానాడులో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తన విమర్శలకి పదును పెడుతున్నారు.

వాస్తవానికి విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడేదాని కంటే ట్విట్టర్‌లోనే ఎక్కువగా తన గళం వినిపిస్తుంటారు. నారా లోకేష్‌ని తరచూ పప్పు, చిట్టి నాయుడు అంటూ వెటకారం చేసే విజయసాయి రెడ్డి చంద్రబాబుని చంబా అంటూ వెక్కిరిస్తూ ట్వీట్‌లు చేసేవారు. ఈ క్రమంలో ఇద్దరినీ ట్రోలింగ్ చేసేందుకు కూడా విజయసాయి రెడ్డి వెనుకాడలేదు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలో నందమూరి తారకరత్న మృతి తర్వాత విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోయారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. విజయ్ సాయి రెడ్డికి కూతురు వరుస అవుతారు. విజయసాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె ఆమె. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహాన్ని జరిపించింది కూడా విజయసాయి రెడ్డి అని ఓ ఇంటర్వ్యూలో అలేఖ్య చెప్పారు.

ఇటీవల మహానాడులో విడుదల చేసిన టీడీపీ మ్యానిఫెస్టోపై ట్విట్టర్‌లో తాజాగా స్పందించిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబుకి తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే సుప్రీంకోర్టు దాకా వెళ్లి గుక్కపట్టి ఏడ్చారు. అలాంటి వారు పేదలను కోటీశ్వరులు చేస్తామంటున్నారు. ఈ చిత్తశుద్ధి లేని హామీల "మాయాఫెస్టో"ను నమ్మేదెవరు!’’ అంటూ రాసుకొచ్చారు.

First Published:  2 Jun 2023 5:35 AM GMT
Next Story