Telugu Global
Andhra Pradesh

టికెట్ ఇవ్వ‌క‌పోయినా ప‌నిచేస్తార‌ట‌.. నిజ‌మేనా?

టీడీపీలో చేరిన త‌ర్వాత మీడియా వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ అన్నీ డొంక తిరుగుడు స‌మాధానాలే చెప్పారు.

టికెట్ ఇవ్వ‌క‌పోయినా ప‌నిచేస్తార‌ట‌.. నిజ‌మేనా?
X

వైసీపీకి గుడ్‌బై చెప్పి తాజాగా టీడీపీ కండువా క‌ప్పుకున్న మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ మైల‌వ‌ర‌మా.. ఇంకోచోట ఎక్క‌డ పోటీ అనేది పార్టీ నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు. టికెట్ ఇవ్వ‌క‌పోయినా టీడీపీ కోసం ప‌ని చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. మైల‌వ‌రం టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌డానికే ఆయ‌న ఇన్నాళ్లూ పార్టీలోకి చేర‌కుండా వేచి చూశార‌ని, అది ఖ‌రార‌య్యాకే పార్టీలో చేరార‌ని మాజీ మంత్రి దేవినేని ఉమా వ‌ర్గీయులు చెబుతున్నారు. పార్టీ నిర్ణ‌య‌మే శిరోధార్యం అన్న‌ట్లు వ‌సంత డైలాగులు కొడుతున్నార‌ని మండిప‌డుతున్నారు.

మీరు ఛాన‌ళ్లు మార‌లేదా?

టీడీపీలో చేరిన త‌ర్వాత మీడియా వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ అన్నీ డొంక తిరుగుడు స‌మాధానాలే చెప్పారు. ఇన్నాళ్లూ అధికార పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ ఎందుకు మారార‌ని ఓ టీవీ ఛాన‌ల్ విలేక‌రి ప్ర‌శ్నిస్తే నువ్వు ఇవాళ ఈ ఛానల్‌లో ఉన్నావు.. నిన్న ఏ ఛానల్‌లో ఉన్నావో రేపు ఏ ఛాన‌ల్‌కు మార‌తావో అలాగే మేమూ అని వెట‌కారంగా మాట్లాడారు.

ఉమాతో మీరు క‌లిపేద్దురు లే అని వ్యంగ్యం

మాన‌సికంగా ఏడాదిన్న‌ర‌గా వైసీపీకి దూరంగా ఉన్నాన‌ని, అక్క‌డ జ‌గ‌న్‌ను మ‌నం ప్రేమించ‌డం త‌ప్ప ఆయ‌న మ‌న‌ల్ని ప్రేమించ‌ర‌ని చెప్పుకొచ్చారు. ఇక్క‌డ ఉన్న ఉమాకు మీకు ప‌డ‌దు క‌దా.. మ‌రి ఎలా క‌లిసి ప‌ని చేస్తార‌ని ఓ టీవీ ఛాన‌ల్ వాళ్లు ప్ర‌శ్నిస్తే.. మీరున్నారుగా మ‌మ్మ‌ల్ని ఫెవికల్ వేసి అతికించ‌డానికి అని వెటకార‌మాడారు.

First Published:  2 March 2024 7:10 AM GMT
Next Story