Telugu Global
Andhra Pradesh

బెజవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి

బస్‌ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 12 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు తమవారి కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బెజవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి
X

బెజవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంత మంది ప్రయాణికులు బస్సు చక్రాల కింద చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.

ఏసీ బస్సు కావడంతో బస్సు కింద భాగంలో ఖాళీ తక్కువగా ఉంటుంది. దీంతో బస్సు కింద ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసుకురావడానికి వీలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బస్‌ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 12 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు తమవారి కోసం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. బ్రేక్‌ ఫెయిల్‌ అయినందు వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

First Published:  6 Nov 2023 4:59 AM GMT
Next Story