Telugu Global
Andhra Pradesh

తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా.. - 21 మందికి గాయాలు

ఊహించని ఈ ప్రమాదంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి అదే వేగంతో రహదారి నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు.

తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా.. - 21 మందికి గాయాలు
X

తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం బోల్తా పడింది. ఈ బస్సు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతుండగా కాకినాడ జిల్లా పరిధిలోని కత్తిపూడి రహదారిపై ఈ ఘటన జరిగింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా బీపీ (బ్లడ్‌ ప్రెజర్‌) డౌన్‌ కావడంతో బస్సుపై ఆయన నియంత్రణ కోల్పోయారు. దీంతో ఈ ప్రమాదం జరిగింది.

ఊహించని ఈ ప్రమాదంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి అదే వేగంతో రహదారి నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడటం పెద్ద ఊరట కలిగించే అంశం. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కిశోర్‌ ఘటనాస్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

First Published:  19 Feb 2024 10:28 AM GMT
Next Story