Telugu Global
Andhra Pradesh

గన్నవరంలో ఉద్రిక్తత...టీడీపీ ఆఫీస్ పై పెట్రోల్ బాంబులతో ఎమ్మెల్యే వంశీ వర్గీయుల దాడి

వంశీ వర్గీయుల బెదిరింపులపై ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు ఈ రోజు వంశీపై పిర్యాదు చేయడానికి ర్యాలీగా పోలీసు స్టేషన్ కు బయలు దేరారు. అది చూసి వంశీ అనుచరులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ రేగింది.

గన్నవరంలో ఉద్రిక్తత...టీడీపీ ఆఫీస్ పై పెట్రోల్ బాంబులతో ఎమ్మెల్యే వంశీ వర్గీయుల దాడి
X

కృష్ణా జిల్లా గన్నవరంలో రెండు రోజులుగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులకు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య గొడ‌వ‌లు జరుగుతున్నాయి.

మూడుర్రోజుల క్రితం వంశీ మీడియాతొ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేశాడు. దాంతో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వంశీపై విమర్శ‌లు చేశారు. దాంతో వంశీ వర్గీయులు టీడీపీ నేతల ఇళ్ళపైకి వెళ్ళి బెదిరించారు.

వంశీ వర్గీయుల బెదిరింపులపై ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు ఈ రోజు వంశీపై పిర్యాదు చేయడానికి ర్యాలీగా పోలీసు స్టేషన్ కు బయలు దేరారు. అది చూసి వంశీ అనుచరులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ రేగింది. ఇంతలో వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేయడమే కాక, పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. టీడీపీ ఆఫీస్ ముందు ఉన్న కారును కూడా వంశీ వర్గీయులు తగలబెట్టారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే వంశీ అక్కడే ఉన్నాడు.

ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు తప్ప కలగజేసుకోలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వంశీ దౌర్జన్యాలకు నిరసనగా, పోలీసుల పద్దతికి వ్యతిరేకంగా ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు హైవేపై ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో హైవేపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిల్చిపోయాయి.

First Published:  20 Feb 2023 12:44 PM GMT
Next Story