Telugu Global
Andhra Pradesh

జగన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?

ఈ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులైన జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.

జగన్ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
X

ఏపీ సీఎం జగన్‌ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్‌ పై ఉన్న కేసుల వ్యవహారంపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్(పిల్‌)పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సీఎం జగన్ సహా సీబీఐ, సీబీఐ కోర్టుకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల వ్యవహారం ఈరోజు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసుల విషయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. జగన్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే.

హరిరామజోగయ్య పిల్ విషయానికొస్తే.. అయన పిటిషన్ ను పిల్‌ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై చీఫ్ జస్టిస్ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. పిల్‌ కు నెంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

పిల్ లో ఏముందంటే..?

జగన్‌ కేసుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలోపు కేసుల సంగతి తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతివాదులైన జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.

First Published:  8 Nov 2023 7:48 AM GMT
Next Story