Telugu Global
Andhra Pradesh

విజయసాయిరెడ్డి బూట్లు నాకటం పనిచేస్తుందో లేదో చూద్దాం- కాంగ్రెస్‌ Vs వైసీపీ

విజయసాయిరెడ్డి రాహుల్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి భూములను దోచేస్తున్నారని ఠాకూర్ విమర్శించారు.

విజయసాయిరెడ్డి బూట్లు నాకటం పనిచేస్తుందో లేదో చూద్దాం- కాంగ్రెస్‌ Vs వైసీపీ
X

వైసీపీకి, కాంగ్రెస్‌ మధ్య మరోసారి నిప్పు రాజుకుంటోంది. రాహుల్ గాంధీ పాదయాత్రపై ఇటీవల విజయసాయిరెడ్డి వరుసగా సెటైర్లు వేస్తున్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఆపేందుకు మాత్రమే పనికొస్తుందని ట్వీట్లు చేశారు. రాహుల్‌ గాంధీకి నడవడం కంటే ఇంతకాలం విదేశీ యాత్రకు వెళ్లకుండా ఉండడమే పెద్ద కష్టమని వ్యాఖ్యానించారు.

ఇలా విజయసాయిరెడ్డి రాహుల్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి భూములను దోచేస్తున్నారని ఠాకూర్ విమర్శించారు. విజయసాయిరెడ్డి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కోట్ల రూపాయలు మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అత్యంత అవినీతిపరుడని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే సీబీఐ కేసులు ఎదుర్కొంటూ, తాజాగా విశాఖలో విజయసాయిరెడ్డి చేస్తున్న భూ దోపిడీపై ప్రధాని మోడీ దర్యాప్తు జరిపించాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి దోపిడీపై దర్యాప్తున‌కు కేంద్రం ఆదేశిస్తుందా లేక విజయసాయిరెడ్డి చేస్తున్న బూట్లు నాకే కార్యక్రమం ప్రభావం చూపుతుందా ?అన్నది చూడాలని మాణిక్యం ఠాకూర్ ఫైర్ అయ్యారు.

First Published:  10 Oct 2022 7:26 AM GMT
Next Story