Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు పచ్చి మోసగాడు - కేశినేని నాని

ఆఫ్ర్టాల్ ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఆదేశిస్తే సీనియర్లు పని చేయాలా..? అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం చంద్రబాబు కుటుంబం ఏమైనా ఆస్తులు అమ్ముకుందా అని ప్రశ్నించారు నాని.

చంద్రబాబు పచ్చి మోసగాడు - కేశినేని నాని
X

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని.. ఆ పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పెద్ద మోసగాడని.. ఆ విషయం రాష్ట్రానికి తెలుసన్నారు. చంద్రబాబు ఇంత పచ్చి మోసగాడని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. బాబు మానసిక వ్యభిచారి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు చేశానని చెప్పారు. బిజినెస్‌ కన్నా పార్టీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానన్నారు. పార్టీ కోసం ఎన్నో అవమానాలు భరించానన్నారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టి వారితోనే కొట్టించేందుకు లోకేశ్‌ ప్రయత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక లోకేశ్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు కేశినేని నాని. లోకేశ్‌కు ఏ అర్హత ఉందని యువగళం పాదయాత్ర చేశాడని ప్రశ్నించారు. ఆఫ్ర్టాల్ ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తి ఆదేశిస్తే సీనియర్లు పని చేయాలా..? అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం చంద్రబాబు కుటుంబం ఏమైనా ఆస్తులు అమ్ముకుందా అని ప్రశ్నించారు నాని. విజయవాడలో 60 శాతం టీడీపీని ఖాళీ చేస్తానని శపథం చేశారు. టీడీపీ-జనసేన కూటమికి 40 సీట్లకు మించి రావన్నారు.

జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు నాని. జగన్ తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని.. జగన్ లీడర్‌షిప్ తనకు నచ్చిందన్నారు. జగన్‌ పథకాలపైనా ప్రశంసలు కురిపించారు కేశినేని. జగన్‌ను టికెట్ అడగలేదని, ఏ పని అప్పగించినా చేస్తానన్నారు. తనకు కావాల్సింది విజయవాడ అభివృద్ధి మాత్రమేనన్నారు. ఇకపై వైసీపతోనే తన ప్రయాణం అని చెప్పారు.

First Published:  10 Jan 2024 12:21 PM GMT
Next Story