Telugu Global
Andhra Pradesh

పార్టీ మార్పు ప్ర‌చారంపై గంటా క్లారిటీ

ఈ సంద‌ర్భంగా పార్టీ మార్పు ప్ర‌చారాన్ని మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస్‌రావు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేమైనా ఉంటే అంద‌రికీ చెబుతాన‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు అన్నీ తానే స‌వివ‌రంగా వివ‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

పార్టీ మార్పు ప్ర‌చారంపై గంటా క్లారిటీ
X

పార్టీ మారుతున్న‌ట్టు ఇటీవ‌ల జ‌రుగుతున్న ప్ర‌చారంపై విశాఖ‌ప‌ట్నం నార్త్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు క్లారిటీ ఇచ్చారు. సోమ‌వారం ఆయ‌న పార్టీ మార్పు ప్ర‌చారంపై స్పందించారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు ఇటీవ‌ల మీడియాలో, సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, త‌న ప్ర‌మేయం లేకుండానే అందుకు డేట్‌, టైమ్ కూడా ఫిక్స్ చేసేశార‌న్నారు. ఆ విష‌యం త‌న దృష్టికి కూడా వ‌చ్చింద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ మార్పు ప్ర‌చారాన్ని మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస్‌రావు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేమైనా ఉంటే అంద‌రికీ చెబుతాన‌ని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు అన్నీ తానే స‌వివ‌రంగా వివ‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఈ నెల 26న వంగ‌వీటి రంగా వ‌ర్ధంతి సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నంలో కాపునాడు కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్న‌ట్టు గంటా శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు. విశాఖ‌లో జ‌ర‌గ‌బోయే కాపునాడు మ‌హాస‌భ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సోమవారం ఆయ‌న పాల్గొన్నారు. రాజ‌కీయాల‌క‌తీతంగా ఈ మ‌హాసభ ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

First Published:  12 Dec 2022 6:58 AM GMT
Next Story