Telugu Global
Andhra Pradesh

తారకరత్న మృతితో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్

ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజవకర్గంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ శివరాత్రి సందర్భంగా లోకేశ్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం రేపు మళ్లీ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే లోకేశ్ హైదరాబాద్ వెళుతున్నందున, పాదయాత్ర మళ్లీ ఎప్పుడు కొనసాగేది ప్రకటించనున్నారు.

తారకరత్న మృతితో లోకేశ్ పాదయాత్రకు బ్రేక్
X

నందమూరి తారకరత్న మృతితో తెలుగుదేశం నాయకుడు లోకేశ్ తన పాదయాత్రను తాత్కాలికంగా ఆపేశారు. లోకేశ్ రేపు ఉదయం హైదరాబాద్ కు రానున్నారు.

ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజవకర్గంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఇవాళ శివరాత్రి సందర్భంగా లోకేశ్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం రేపు మళ్లీ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే లోకేశ్ హైదరాబాద్ వెళుతున్నందున, పాదయాత్ర మళ్లీ ఎప్పుడు కొనసాగేది ప్రకటించనున్నారు.

కాగా తారకరత్న మృతి పట్ల లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు.

''బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు.

నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్నకు క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.'' అమి ట్వీట్ చేశారు లోకేశ్

First Published:  18 Feb 2023 5:56 PM GMT
Next Story