Telugu Global
Andhra Pradesh

2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును జ‌నం మోసం చేశారు.. - పాద‌యాత్ర‌లో లోకేష్

త‌న పాద‌యాత్ర‌కు వైసీపీ శ్రేణులు అడుగ‌డుగునా అడ్డు త‌గులుతున్నార‌ని లోకేష్ ఆరోపించారు. ఇక‌పై పాద‌యాత్ర‌కు అడ్డు త‌గిలితే వారిని కొట్టుకుంటూ వెళ‌తాన‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును జ‌నం మోసం చేశారు.. - పాద‌యాత్ర‌లో లోకేష్
X

రాష్ట్రాన్ని, అభివృద్ధిని, చంద్ర‌బాబును గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మోసం చేశార‌ని టీడీపీ నేత లోకేష్ అన్నారు. ఆదివారం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా జోగ‌న్న‌పేట‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో లోకేష్ మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా టీడీపీకి ఓటు వేసి గెలిపించాల‌ని ఆయ‌న కోరారు.

త‌న పాద‌యాత్ర‌కు వైసీపీ శ్రేణులు అడుగ‌డుగునా అడ్డు త‌గులుతున్నార‌ని లోకేష్ ఆరోపించారు. ఇక‌పై పాద‌యాత్ర‌కు అడ్డు త‌గిలితే వారిని కొట్టుకుంటూ వెళ‌తాన‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని, 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి పూర్తి సినిమా చూపిస్తామ‌ని లోకేష్ చెప్పారు.

47వ రోజు యువ‌గ‌ళం పాద‌యాత్ర శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా రాత్నాల‌ప‌ల్లి వ‌ద్ద 600 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది. క‌దిరిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ట‌మాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

First Published:  20 March 2023 3:57 AM GMT
Next Story