Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఫ్లెక్సీలు చింపింది వారేనా..?

ఇద్దరూ రాజాం టీడీపీ టికెట్ తమకేనంటూ ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో కావలి గ్రీష్మ ఏర్పాటు ఫ్లెక్సీలను వేకువ జామున కారులో వచ్చిన కొందరు చించేయడంతో కోండ్రు వర్గంపైకి అనుమానాలు మళ్లాయి.

Chandrababu Naidu
X

చంద్రబాబు ఫ్లెక్సీలు చింపింది వారేనా..?

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. మరోవైపు టీడీపీ గ్రూపు గొడవలతో సతమతమవుతోంది. టీడీపీ టికెట్ల రేసు కారణంగానే చంద్రబాబు ఫ్లెక్సీలు చింపేశారని అనుమానాలు మొదలయ్యాయి.

చిలకపాలెం జంక్షన్ లో ఏర్పాటు చేసిన చంద్రబాబు, కళా వెంకట్రావు ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లో కలిశెట్టి అప్పలనాయుడు కళా వెంకట్రావుల మధ్య సీటు ఫైటు సాగుతోంది.

రాజాం పట్టణంలో మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, గ్రీష్మా.. ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫ్లెక్సీలను చించి వేయడం కలకలం రేపుతోంది. రాజాంలో పోటా పోటీగా కావలి గ్రీష్మ, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇద్దరూ రాజాం టీడీపీ టికెట్ తమకేనంటూ ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో కావలి గ్రీష్మ ఏర్పాటు ఫ్లెక్సీలను వేకువ జామున కారులో వచ్చిన కొందరు చించేయడంతో కోండ్రు వర్గంపైకి అనుమానాలు మళ్లాయి. రాజాం టీడీపీలో గ్రూపుల గొడవలే ఫ్లెక్సీల వార్ కి కారణం అంటున్నారు.

First Published:  22 Dec 2022 6:00 AM GMT
Next Story