Telugu Global
Andhra Pradesh

మ‌హిళా క‌లెక్ట‌ర్‌తో టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ స్పంద‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తాడిప‌త్రిలో ఓ భూ వివాదం గురించి క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన ఆయ‌న ఒక్క‌సారిగా ఆవేశంతో ఊగిపోయారు.

మ‌హిళా క‌లెక్ట‌ర్‌తో టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
X

తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర రెడ్డి క‌లెక్ట‌రేట్‌లో రౌడీయిజం ప్ర‌ద‌ర్శించారు. మ‌హిళా క‌లెక్ట‌ర్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఎదుట పేప‌ర్లు విసిరేసి.. నువ్వు క‌లెక్ట‌ర్‌గా ప‌నికిరావంటూ ఆమెను అవ‌మానించారు. అంత‌టితో ఆగ‌క `బీ కేర్‌ఫుల్‌` అంటూ క‌లెక్ట‌ర్‌కే వార్నింగ్ ఇచ్చారు.

అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ స్పంద‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తాడిప‌త్రిలో ఓ భూ వివాదం గురించి క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన ఆయ‌న ఒక్క‌సారిగా ఆవేశంతో ఊగిపోయారు. క‌లెక్ట‌ర్‌ను బెదిరిస్తున్న క్ర‌మంలో గ‌న్‌మెన్ ప్ర‌భాక‌ర‌రెడ్డిని వారించే ప్ర‌య‌త్నం చేసినా ప‌ట్టించుకోకుండా ఆయ‌న గ‌న్‌మెన్‌ను వెన‌క్కి నెట్టివేశారు. అనంత‌రం బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న మీడియాతో కూడా దురుసుగా మాట్లాడారు.

అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై త‌న‌ను సంప్ర‌దించిన మీడియాతో క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స్పందిస్తూ.. జేసీ ప్ర‌భాక‌ర‌రెడ్డిపై ఫిర్యాదు చేసే యోచ‌న లేద‌ని చెప్పారు. స‌జ్జ‌ల‌దిన్నె భూమికి నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఎన్‌వోసీ జారీ చేశామ‌ని ఆమె తెలిపారు. త‌మ ప‌నితీరుపై అభ్యంత‌రం ఉంటే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఆమె ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

First Published:  7 Nov 2022 8:58 AM GMT
Next Story