Telugu Global
Andhra Pradesh

పాత ఫోటోతో బాలకృష్ణ రేంజ్‌ పెంచే పనిలో టీడీపీ

బాలయ్య గురించి మొరిగే మంత్రులకు, ఎవరు ఏంటో ఈ చిత్రమే చెబుతుంది అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఒకసారి అసెంబ్లీలో బాలకృష్ణతో సెల్ఫీ దిగిన ఫొటోను షేర్ చేసింది టీడీపీ.

పాత ఫోటోతో బాలకృష్ణ రేంజ్‌ పెంచే పనిలో టీడీపీ
X

వర్సిటీకి పేరు మార్పు అంశాన్ని బాలకృష్ణ తన మీదకు డైవర్ట్ చేసుకున్నారు. వైసీపీ నేతలను దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన తర్వాత బాలకృష్ణ మీదకు మంత్రులు ఏకధాటిగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ ఒక ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. బాలయ్య గురించి మొరిగే మంత్రులకు, ఎవరు ఏంటో ఈ చిత్రమే చెబుతుంది అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఒకసారి అసెంబ్లీలో బాలకృష్ణతో సెల్ఫీ దిగిన ఫొటోను షేర్ చేసింది టీడీపీ.

ఈ ఫొటో దిగింది. మూడు రాజధానుల కోసం తొలిసారి జగన్‌మోహన్ రెడ్డి బిల్లు తెచ్చి శాసనమండలికి పంపిస్తే.. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని నాటి మండలి చైర్మన్‌కు సైగ చేస్తూ బిల్లుకు గండికొట్టిన రోజే ఈ ఫొటో దిగారు. అయినా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేతో ఫొటో ఎందుకు దిగారని ఎమ్మెల్యేలకు జగన్ చీవాట్లు పెట్టలేదు.

బాలకృష్ణ మీదగానీ, ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మీద గానీ తమ నాయకుడు జగన్‌కు ఎలాంటి ద్వేషం లేదని తెలుసు కాబట్టి.. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఫొటో దిగే సాహసం చేశారని వైసీపీ వారు వాదిస్తున్నారు. అదే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా ఒక వైసీపీ ప్రముఖుడితో ఫొటో దిగి ఉంటే చంద్రబాబు ఊరుకుండేవారా? అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు.

First Published:  25 Sep 2022 11:59 AM GMT
Next Story