Telugu Global
Andhra Pradesh

రామోజీ, చంద్రబాబు సుదీర్ఘ భేటీ

సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబునాయుడు.. రాత్రి 7.30 గంట‌ల‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు.

రామోజీ, చంద్రబాబు సుదీర్ఘ భేటీ
X

ఈనాడు అధినేత రామోజీరావును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిశారు. చంద్రబాబే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావుతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మూడున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబునాయుడు.. రాత్రి 7.30 గంట‌ల‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

ఏపీలోని రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు చెబుతున్నారు. జనసేనతో పొత్తు, బీజేపీ వైఖరి, జగన్‌ను నిలువరించడం ఎలా వంటి అంశాలపై రామోజీరావు నుంచి చంద్రబాబు సలహాలు తీసుకున్నట్టు భావిస్తున్నారు. జనవరి 27 నుంచి తన కుమారుడు నారా లోకేష్ మొదలుపెడుతున్న పాదయాత్ర గురించి కూడా చంద్రబాబు రామోజీరావుకు వివరించి ఉండవచ్చు.

ఇటీవల ఈనాడు పత్రిక కూడా దూకుడు పెంచింది. జగన్‌ ప్రభుత్వంపై విపరీతంగా వ్యతిరేక కథనాలతో విరుచుకుపడుతోంది. కొన్నిసార్లు నిజానిజాలతో కూడా సంబంధం లేకుండా ఈనాడు కథనాలు రాస్తోందన్న విమర్శ కూడా అధికార పార్టీ నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

First Published:  12 Nov 2022 2:21 AM GMT
Next Story