Telugu Global
Andhra Pradesh

పవన్ కి అంత పవనం లేదు.. చమడాలన్నీ ఊడిపోయాయి

సడన్ గా పవన్ ని టార్గెట్ చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పవన్ కు అంత పవనం లేదని ఎద్దేవా చేశారు. ఆయన చమడాలన్నీ ఆల్రడీ ఊడిపోయాయన్నారు.

పవన్ కి అంత పవనం లేదు.. చమడాలన్నీ ఊడిపోయాయి
X

పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు కామన్. అయితే నాయకులకు అంత అవకాశం లేకుండా పార్టీ అధినేత సీఎం జగన్.. పవన్ విషయంలో ఫుల్ డోస్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో జగనన్న ఇళ్ల పంపిణీ సభలో పవన్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు మరింత వివాదాస్పదం అయ్యాయి. ఈ దశలో మిగతా నాయకులెవరూ పెద్దగా పవన్ జోలికి వెళ్లడంలేదు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలే ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉన్నాయి. అయితే సడన్ గా పవన్ ని టార్గెట్ చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పవన్ కు అంత పవనం లేదని ఎద్దేవా చేశారు. ఆయన చమడాలన్నీ ఆల్రడీ ఊడిపోయాయన్నారు.

చంద్రబాబుని చంపితే మాకేంటి..?

చంద్రబాబు ఆర్థిక నేరగాడు అని, ప్రజలు ఆయన గురించి అసలు పట్టించుకోవడంలేదని అన్నారు తమ్మినేని సీతారాం. అలాంటి చంద్రబాబుని చంపితే మాకేం వస్తుందని ప్రశ్నించారు. ఆయన ఎక్కడున్నా ఒకటేనన్నారు. జైలులో సదుపాయాల గురించి కోర్టు ఏం చెబితే ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేస్తుందన్నారు. చంద్రబాబు ఏమైనా.. మహాత్మా గాంధీనా, నెహ్రూ నా..? ఆయన ఓ ఆర్థిక నేరగాడు అని ఎద్దేవా చేశారు. టీడీపీ పని క్లోజ్ అయిపోయిందని చెప్పారు తమ్మినేని. జగన్ ని కూడా 16 నెలలు జైలులో పెట్టారని, కానీ ఏమీ నిరూపించలేకపోయారన్నారు.

ఎంపీగా బరిలో..?

తమ్మినేని సీతారాం తొలిదశలోనే మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చి సరిపెట్టారు. రెండోసారి మార్పులు చేర్పుల సమయంలో అయినా అమాత్యయోగం దక్కుతుందేమో అనుకున్నారు, కానీ కుదరలేదు. 2024లో పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశముందని అంటున్నారు. ఆ వార్తలపై కూడా తమ్మినేని స్పందించారు. ఎంపీ స్థానంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతానని చెప్పారు తమ్మినేని.


First Published:  17 Oct 2023 7:06 AM GMT
Next Story