Telugu Global
Andhra Pradesh

AP:అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తోపాటు 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ఆవరణలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తన నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తనను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు.

AP:అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తోపాటు 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
X

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు మరో 12 మంది తెలుగుదేశం సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

సభాకార్యక్రమాలు జ‌రగకుండా అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు,నిమ్మకాయల చినరాజప్ప ,పయ్యావుల కేశవ్,బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్,డోలా బాల వీరాంజనేయస్వా మి,నిమ్మల రామానాయుడు,ఆదిరెడ్డి భవాని,మంతెన రామరాజు,గణబాబు, గొట్టిపాటి రవికుమార్,ఏలూరి సాంబశివరావు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి లను సభనుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకున్నారు.

వీరిలో పయ్యావులకేశవ్, నిమ్మ ల రామానాయుడు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లను బడ్జెట్ సమావేశాలు అయిపోయేదాకా సస్పెండ్ చేయగా , మిగతావారిని ఈ ఒక్కరోజు కోసం సస్పెండ్ చేశారు

సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ఆవరణలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తన నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తనను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు.

First Published:  15 March 2023 9:59 AM GMT
Next Story