Telugu Global
Andhra Pradesh

వైజాగ్ లో వందేభారత్ రైలుపై రాళ్ళ దాడి

ఈ రోజు ఆ రైలు ను ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మర్రి పాలెం రైల్వే యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రైలుపై రాళ్ళ దాడి జరిగింది.

వైజాగ్ లో వందేభారత్ రైలుపై రాళ్ళ దాడి
X

విశాఖపట్నంలో వందేభారత్ రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. సికిందరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నడవబోయే ఈ రైలును ప్రధాని మోడీ ప్రారంభించాల్సిఉంది.

ఈ రోజు ఆ రైలు ను ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మర్రి పాలెం రైల్వే యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రైలుపై రాళ్ళ దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై డీఆర్ ఎం అనూప్ సత్ప‌తి విచారణకు ఆదేశించారు.

First Published:  11 Jan 2023 4:17 PM GMT
Next Story