Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు తుపాకీ పేల్చకముందే మీరే పేల్చండి.. - వలంటీర్లతో మంత్రి ధర్మాన

ఏ రాజకీయ పార్టీ మంచిదో, ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో చెప్పే హక్కు వలంటీర్లకు లేదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రతిపౌరుడికి ఉండే హక్కులన్నీ వలంటీర్లకూ ఉంటాయన్నారు.

చంద్రబాబు తుపాకీ పేల్చకముందే మీరే పేల్చండి.. - వలంటీర్లతో మంత్రి ధర్మాన
X

చంద్రబాబు అధికారంలోకి వస్తే తొలుత తుపాకీ పేలేది వలంటీర్ల మీదనేనని హెచ్చరించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు తుపాకీ పేల్చడానికి ముందే వలంటీర్లే తుపాకీ పేల్చాలన్నారు. ప్రస్తుతం మన దగ్గరే తుపాకీ ఉందని.. కాబట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చి తుపాకీ పేల్చడానికి ముందే మనమే పేలిస్తే సరి అని సలహా ఇచ్చారు.

ఏ రాజకీయ పార్టీ మంచిదో, ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో చెప్పే హక్కు వలంటీర్లకు లేదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రతిపౌరుడికి ఉండే హక్కులన్నీ వలంటీర్లకూ ఉంటాయన్నారు. ఒక మంచి రాజకీయ పార్టీకి ఓటేయాల్సిందిగా చెప్పే హక్కు వలంటీర్లకు ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లా సత్తివాడలో జరిగిన గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన.. ధరలు దేశం మొత్తం పెరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతోనే పిల్లలు చదుకుంటున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాలన్నారు.

ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్న వాడు కూడా.. పక్కింటోడి వద్దకు వెళ్లి ఈ ప్రభుత్వం వల్ల అంతా నాశనం అయిపోతోందంటూ చెబుతున్నాడని, అలా విమర్శిస్తున్న వాడు ప్రభుత్వం అకౌంట్‌లో వేసిన డబ్బులను వెనక్కు ఇవ్వాలన్నారు.

First Published:  6 Feb 2023 8:53 AM GMT
Next Story