Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై మహిళా కమిషన్‌ మెంబర్ సంచలన ఆరోపణలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెత్తురు కక్కుకుని చావాలని బాధితురాలు గతంలో శపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2019లో ఒకసారి సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు వస్తే ఆమెను బెదిరించింది నిజం కాదా అని నిలదీశారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై మహిళా కమిషన్‌ మెంబర్ సంచలన ఆరోపణలు
X

నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మీ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒక మహిళను శ్రీధర్ రెడ్డి వేధించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కావాలంటే ఈ అంశంపై చాలా వివరాలను తాను వెల్లడించగలను అన్నారు.


ఆ మహిళను బెదిరించడం వల్ల ఇప్పటికీ బయటకు రాలేకపోతోందన్నారు. ఆమె బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడితే నిన్ను, నీ తమ్ముడిని జైలులో వేయడం క్షణం పని శ్రీధర్ రెడ్డిని హెచ్చరించారామె.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెత్తురు కక్కుకుని చావాలని బాధితురాలు గతంలో శపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2019లో ఒకసారి సదరు మహిళ ఫిర్యాదు చేసేందుకు వస్తే ఆమెను బెదిరించింది నిజం కాదా అని నిలదీశారు.


శ్రీధర్ రెడ్డి అడిగితే స్టేషన్‌ నుంచి, బాధితుల నుంచి సేకరించిన వివరాలను బయట పెట్టేందుకు తాను సిద్ధమన్నారు. ఎంత మంది మహిళలను వీడియో కాల్స్‌ ద్వారా వేధిస్తున్నారో కూడా తమకు తెలుసన్నారు.

కడప జిల్లాకు చెందిన ఒక మహిళా డాక్టర్‌ నెల్లూరులో పనిచేస్తోందని.. ఆమె రెండేళ్ల క్రితం భూమి కొనుగోలు కోసం ముగ్గురు రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు డబ్బు చెల్లిస్తే .. వారు భూమి రిజిస్ట్రేషన్ చేయకపోతే సదరు డాక్టర్.. శ్రీధర్ రెడ్డిని ఆశ్రయిస్తే ఏం చేశారో కూడా తమకు తెలుసన్నారు.


భూమిని కొనే ముందు రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనను కలవాలి కదా అని మాట్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. విశ్వాసపాత్రుడు అని నమ్మి జగన్‌ బీఫాం ఇస్తే గెలిచి మోసం చేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. కోటంరెడ్డి చేసిన అవినీతి గురించి సీఎంకు పూర్తిగా తెలియలేదని.. తెలిసి ఉంటే ముందే మెడ పట్టి బయటకు గెంటేసేవారన్నారు గజ్జల లక్ష్మి..

First Published:  19 Feb 2023 3:06 PM GMT
Next Story