Telugu Global
Andhra Pradesh

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లకు తృటిలో తప్పిన ప్రమాదం

మిథున్ రెడ్డి వాహనంలో ఉన్న పర్సనల్ పీఏ, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి లకు తృటిలో తప్పిన  ప్రమాదం
X

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల కాన్వాయ్ లోని మిథున్ రెడ్డి కారుకు ఎదురుగా స్పీడ్ గా వచ్చిన మరో కారు బలంగా ఢీ కొట్టింది. దాంతో ఆ కారులోని 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అయితే ఆ సమయంలో ఆ కార్లో ఉండాల్సిన మిథున్ రెడ్డి, మంత్రి రామచంద్రా రెడ్డి కార్లో ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

మిథున్ రెడ్డి వాహనంలో ఉన్న పర్సనల్ పీఏ, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆ కారు మిథున్ రెడ్డి కారును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

First Published:  16 Jan 2023 9:11 AM GMT
Next Story