Telugu Global
Andhra Pradesh

చంపుతామని బెదిరిస్తున్నారు.. లోకేష్‌ నుంచి ప్రాణహాని ఉంది

రాయపాటి రంగారావు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. తనను చంపేందుకు కిరాయి గూండాలను మాట్లాడారని ఆయన చెప్పారు.

చంపుతామని బెదిరిస్తున్నారు.. లోకేష్‌ నుంచి ప్రాణహాని ఉంది
X

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన రాయపాటి రంగారావు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమ వద్ద కోట్లాది రూపాయలు డబ్బు కొల్లగొట్టారని, పోలవరం ప్రాజెక్టు నిధులు భారీగా కైంకర్యం చేశారని ఆయన చెప్పారు. వారి అవినీతిపై ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, కావాలంటే టీవీ ఛానల్‌లో చర్చ పెడితే తాను అన్నీ బయటపెడతానని స్పష్టం చేశారు.

నన్ను చంపేందుకు గూండాలను మాట్లాడారు...

ఇదిలావుండగా.. రాయపాటి రంగారావు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. తనను చంపేందుకు కిరాయి గూండాలను మాట్లాడారని ఆయన చెప్పారు. కాల్స్‌ విశాఖపట్నం నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ బెదిరింపు కాల్స్‌పై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.

లోకేష్‌ వల్ల ప్రాణహాని ఉంది

లోకేష్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందని రాయపాటి రంగారావు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన వివరించారు. ఫైబర్‌ నెట్‌లో అంతా అవినీతే చేశారని ఆయన తెలిపారు. రాజధానిలో మీరు పోగు చేసిన చందాల లెక్కలు చెప్పగలరా.. అంటూ నిలదీశారు. మీ అవినీతిపై నేను ప్రమాణం చేస్తా.. అవినీతి చేయలేదని ప్రమాణం చేసే దమ్ముందా లోకేష్‌.. అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీలో ఒక్కో ఎమ్మెల్యే సీటు కోసం ఎంత తీసుకుంటున్నారో లోకేష్‌ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.

First Published:  15 Jan 2024 3:04 AM GMT
Next Story