లైంగికంగా వేధిస్తున్నారు.. మాజీ మంత్రి నారాయణపై మరదలు ఫిర్యాదు
ప్రియ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేయడానికి బయలుదేరిన ఆమెను ఇంటి వద్ద అడ్డుకోవడానికి ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.
BY Telugu Global12 Feb 2024 11:25 AM GMT
X
Telugu Global Updated On: 12 Feb 2024 11:25 AM GMT
మాజీ మంత్రి, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణపై ఆయన మరదలు ప్రియ నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని, అయినా కూడా మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా తనపై ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకు ముందు ప్రియ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. నారాయణపై ఫిర్యాదు చేయడానికి బయలుదేరిన ఆమెను ఇంటి వద్ద అడ్డుకోవడానికి ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. వారి చెర నుంచి తప్పించుకుని ఎస్పీ ఆఫీస్కు చేరుకున్న ఆమె.. బావ నారాయణపై ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆమె నారాయణపై ఇదే విధమైన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story