Telugu Global
Andhra Pradesh

చిరంజీవిని, పవన్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టింది రామోజీనే.. - పోసాని కృష్ణమురళి

రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ సీఎం అయితే తాము ఏమైపోతామోననే భయం రామోజీ, చంద్రబాబులో ఉందని పోసాని విమర్శించారు. చంద్రబాబు అవకాశవాది అని ధ్వజమెత్తారు.

చిరంజీవిని, పవన్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టింది రామోజీనే.. - పోసాని కృష్ణమురళి
X

గతంలో చిరంజీవిని, పవన్‌ కల్యాణ్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టింది రామోజీనే అని న‌టుడు పోసాని కృష్ణమురళి గుర్తుచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసింది రామోజీనే అని ఆయన తెలిపారు. రామోజీకి నీతిమంతుడిలా కనపడుతున్నాడా అంటూ ఆయన ప్రశ్నించారు. కుట్రలతో ఎన్టీఆర్‌ దగ్గర పార్టీని లాక్కున్నది చంద్రబాబు కాదా? వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ సీఎం అయితే తాము ఏమైపోతామోననే భయం రామోజీ, చంద్రబాబులో ఉందని పోసాని విమర్శించారు. చంద్రబాబు అవకాశవాది అని ధ్వజమెత్తారు. తన స్వలాభం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడని విమర్శించారు. చంద్రబాబు మోసాలు చేస్తాడు కాబట్టే జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటాడని ఆయన తెలిపారు. రామోజీ మార్గదర్శి సంస్థను పెట్టింది ఎవరి డబ్బుతో అని పోసాని ప్రశ్నించారు. అందులో ఉన్న డబ్బంతా రామోజీ పందికొక్కులా తిన్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. మానవత్వం, స్నేహభావం ఉన్నవారే వలంటీర్లని వారిపైనే విష ప్రచారం చేస్తావా అంటూ రామోజీరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రికను ఆఖరికి టాయిలెట్‌ పేపర్‌గా మాత్రమే వాడతారని చెప్పారు. పచ్చిగా మాట్లాడటం తప్పుకాదు.. అబద్ధం చెప్పడం తప్పని ఆయన తెలిపారు. వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో ఉన్నారని పోసాని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది బీజేపీతో పొత్తు కోసమేనని జరుగుతున్న చర్చపై మాట్లాడుతూ.. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నమాట వాస్తవమేనని, కానీ అందుకు బీజేపీ అంగీకరిస్తే.. ఆ పార్టీకి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని పోసాని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీని చంద్రబాబు అడ్డగోలుగా చేసిన దూషణలను మర్చిపోతారని తాను అనుకోవడం లేదని చెప్పారు.

First Published:  9 Feb 2024 10:22 AM GMT
Next Story