Telugu Global
Andhra Pradesh

బాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది.. - పురందేశ్వరికి పోసాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

చంద్రబాబు అవినీతిపరుడని పురందేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్, ప్రధానమంత్రి మోదీ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు వీడియో క్లిప్పింగ్‌లను ఆయన చూపించారు.

బాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది..  - పురందేశ్వరికి పోసాని స్ట్రాంగ్‌ కౌంటర్‌
X

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పిందని గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిని సీనియర్‌ ఎన్టీఆర్‌ అప్పుడే బయటపెట్టారని చెప్పారు. చంద్రబాబు అవినీతిపరుడని పురందేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్, ఆమె పార్టీ ప్రధానమంత్రి మోదీ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు వీడియో క్లిప్పింగ్‌లను ఆయన చూపించారు. చంద్రబాబు ఎంత అవినీతిపరుడో ఈ ముగ్గురూ క్లియర్‌గా చెప్పారు చూశారుగా అని వివరించారు.

బీజేపీపై దోమంత ప్రేమ కూడా లేదు...

పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కాగానే సీఎం జగన్‌ను, వైఎస్సార్‌సీపీని తిట్టడం మొదలు పెట్టారని పోసాని విమర్శించారు. చంద్రబాబు బంధువు, దగ్గరి బంధువు కాబట్టి వచ్చీరాగానే ఆయన అరెస్టుపై మాట్లాడుతున్నారని చెప్పారు. కక్షగట్టి బాబును అరెస్ట్‌ చేశారని అంటున్నారని విమర్శించారు. పురందేశ్వరికి బీజేపీపై దోమంత ప్రేమ కూడా లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్‌లో చేరిపోతారా?

చంద్రబాబు తన పదవి కోసం ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారని, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారని పోసాని గుర్తుచేశారు. ఈ విషయం పురందేశ్వరికి తెలియదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పెట్టిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారని, అప్పుడు పురందేశ్వరి ఎందుకు ప్రశ్నించ‌లేదని నిలదీశారు.. ఎన్టీఆర్‌ వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీలో మీరు ఎలా చేరారని ప్రశ్నించారు. బీజేపీ ఓడిపోతే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోతారా అంటూ ఎద్దేవా చేశారు. నిత్యం రాజకీయ పార్టీలు మారే మీకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.

First Published:  23 Sep 2023 2:02 PM GMT
Next Story