Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు కొత్త తలనొప్పి.. ఏపీ బీజేపీ సీనియర్ల రహస్య భేటీ

ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య భేటీ నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

చంద్రబాబుకు కొత్త తలనొప్పి.. ఏపీ బీజేపీ సీనియర్ల రహస్య భేటీ
X

ఏపీ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరు ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇస్తోంది. దీంతో ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య భేటీ నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై సీనియర్లు అసహనంలో ఉన్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపైనా చర్చిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  13 March 2024 1:04 PM GMT
Next Story