Telugu Global
Andhra Pradesh

లోకేష్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్

లోకేష్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్
X

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ మరింత స్పెషల్ గా మారింది. ఆయన ఈరోజు 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. పైలాన్ ఆవిష్కరణ, సెల్ఫీలు, హడావిడి.. ఇవన్నీ ఉండేవే కానీ ఈరోజు ఆయన యాత్రకు స్పెషల్ గెస్ట్ లు వచ్చారు. వారిలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఇన్నాళ్లూ చంద్రబాబు-బాలయ్య కాంబినేషన్ ని జనం చూశారు. ఇప్పుడు లోకేష్-మోక్షజ్ఞ కాంబినేషన్ నందమూరి అభిమానుల్ని అలరించింది.

లోకేష్ తో పాటు ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కూడా యాత్రలో పాల్గొన్నారు. లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ యువగళంలో పాల్గొన్నారు. యాత్ర 3వేల మైలురాయిని చేరడం సంతోషకరం అని చెప్పారు. లోకేష్ యువగళం మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద లోకేష్ యాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అక్కడ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియాలో కూడా లోకేష్ యాత్రని అభినందిస్తూ పలువురు సందేశాలను పంపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. 10 ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 8వతేదీనుంచి యాత్ర ఆగిపోయింది. 79 రోజుల విరామం అనంతరం నవంబర్ 26న తిరిగి యాత్ర ప్రారంభించారు లోకేష్. ఇప్పుడు 3వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నారు.

First Published:  11 Dec 2023 9:23 AM GMT
Next Story