Telugu Global
Andhra Pradesh

డ్రాయర్లతో ఊరేగిస్తా జాగ్రత్త –లోకేష్

గన్నవరంలో కాదు, దమ్ముంటే ఇక్కడికి రండి చూసుకుందామని అన్నారు. పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని ఒక్కొక్కరినీ కట్ డ్రాయర్లతో ఊరేగిస్తా జాగ్రత్త అని హెచ్చరించారు.

డ్రాయర్లతో ఊరేగిస్తా జాగ్రత్త –లోకేష్
X

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీసం మెలేసి సవాల్ విసిరారు. టీడీపీ ఆఫీస్ తగలబెడితే కేసులు పెట్టని పోలీసులు, తాను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు ఎందుకు పెడుతున్నారంటూ మండిపడ్డారు. తాను పాదయాత్ర చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు, కత్తులు, రాళ్లతో దాడి చేయడానికి చూస్తున్నారని, వారిపై కేసులు పెట్టకుండా తన జోలికి ఎందుకొస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు.

కట్ డ్రాయర్లతో ఊరేగిస్తా..

చంద్రబాబుపై చిటికేయమనండి మీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు లోకేష్. గన్నవరంలో కాదు, దమ్ముంటే ఇక్కడికి రండి చూసుకుందామని అన్నారు. పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని ఒక్కొక్కరినీ కట్ డ్రాయర్లతో ఊరేగిస్తా జాగ్రత్త అని అన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని, కావాలనే టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు లోకేష్. యువగళం పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు.


లోకేష్ కాదు బూతేష్..

గన్నవరం దాడి వ్యవహారంపై స్పందించిన లోకేష్.. వాళ్లు ఒకటి పగలగొడితే మనం వంద పగల --తాం అనే వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వైసీపీ నేతలు లోకేష్ మాట్లాడిన బూతుల్ని పదే పదే రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు కూడా లోకేష్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన లోకేష్ కాదని, నారా బూతేష్ అని ఎద్దేవా చేసారు.



First Published:  22 Feb 2023 3:13 PM GMT
Next Story