Telugu Global
Andhra Pradesh

జగన్ భయపడ్డాడంట.. లోకేష్ కామెడీ

కోర్టు తీర్పుని కామెంట్ చేయడం కుదరదు కాబట్టి.. మరోసారి సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ ట్వీట్ వేశారు.

జగన్ భయపడ్డాడంట.. లోకేష్ కామెడీ
X

వైఎస్ వివేకా హత్యకేసు విషయంలో టీడీపీ రాజకీయ విమర్శలకు కాలం చెల్లిన విషయం తెలిసిందే. ఈ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం సరికాదని కడప కోర్టు సంచలన ఉత్తర్వులిచ్చింది. దీంతో టీడీపీకి ఏం చేయాలో తోచడంలేదు. కోర్టు తీర్పుని కామెంట్ చేయడం కుదరదు కాబట్టి.. మరోసారి సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ ట్వీట్ వేశారు.

ట్వీట్ లో కూడా వైఎస్ వివేకా పేరెత్తడానికి భయపడిన లోకేష్.. జగన్ భయపడ్డారంటూ జోక్ చేశారు. మీ కుటుంబంలో జరిగిన ఓ హత్య గురించి కోర్టుకి వెళ్లి మరీ ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారని జగన్ ని ప్రశ్నించారు లోకేష్. అంతలా ఎందుకు భయపడ్డారని అన్నారు.


భయపడింది ఎవరు..?

వైఎస్ వివేకా హత్యని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం ఇప్పుడు హైలైట్ చేస్తోంది టీడీపీ. కడప లోక్ సభ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ షర్మిల, సునీత కూడా ప్రచారంలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. వారిద్దరి మాటలకు ఎల్లో మీడియా విపరీతమైన ప్రాముఖ్యతనిస్తోంది. ఆ సందర్భాన్ని టీడీపీ కూటమి కూడా వాడుకోవడం విశేషం. కోర్టు పరిధిలో, విచారణ జరుగుతున్న సందర్భంలో టీడీపీ కేవలం రాజకీయ స్వలాభం కోసమే ఈ కామెంట్లు చేస్తున్నదనేది బహిరంగ రహస్యం. కడప కోర్టు ఆదేశాలు ఘాటుగా తగలడంతో టీడీపీ బ్యాచ్ కి దిమ్మ తిరిగినట్టయింది. షర్మిల, సునీతకు కూడా ఇక మాట్లాడటానికి టాపిక్ అంటూ ఉంటదు. ప్రచారంలో సునీతను వెంటబెట్టుకుని తిరగడం షర్మిలకు కూడా ఉపయోగం ఉండదు. వారిద్దర్నీ అడ్డు పెట్టుకుని జగన్ ని టార్గెట్ చేయాలుకున్న టీడీపీ కుయుక్తులు కూడా ఫలించలేదు. దీంతో నారా లోకేష్ ఏడ్పుగొట్టు ట్వీట్ వేశారు.

First Published:  19 April 2024 2:25 AM GMT
Next Story