Telugu Global
Andhra Pradesh

వైసీపీ నేతల‌పై నారా బ్రాహ్మణి పరువు నష్టం దావా ?

నారా బ్రహ్మణి నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1,600 కోట్లతో జయలలితకు చెందిన ఫామ్ హౌజ్ ఎలా కొన్నారని సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. వారిపై త్వరలోనే బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని ఆ పార్టీ తెలిపింది.

వైసీపీ నేతల‌పై నారా బ్రాహ్మణి పరువు నష్టం దావా ?
X

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని తెలుగుదేశం మంగళవారం ప్రకటించింది.

నారా బ్రహ్మణి నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1,600 కోట్లతో జయలలితకు చెందిన ఫామ్ హౌజ్ ను కొన్నారని, అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిదంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చేసిన పలు పోస్టుల‌ను టీడీపీ ప్రస్తావించింది. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వెల్లడించింది.

''తన పైనా తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి... స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది''

''నారా బ్రాహ్మణి గారు నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1600 కోట్లతో దివంగత జయలలితకు చెందిన ఫార్మ్ హౌస్ ను కొన్నారని... అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిది అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారు.'' అని టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్లు పోస్ట్ చేశారు.


First Published:  25 Oct 2022 2:03 PM GMT
Next Story