Telugu Global
Andhra Pradesh

గట్టి చట్నీ అన్నయ్యా.. నా జోలికొస్తే చాలా చెబుతా.. -వంశీ

పట్టాభి రాజమండ్రి స్కూల్‌ ఆఫ్ సెంట్రల్‌ జైలుకు, చంద్రబాబు రాజనాల స్కూల్ ఆఫ్ ఓల్డ్ విలన్స్ కు వెళ్తున్నారని.. తాను బిజినెస్ స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పారు.

గట్టి చట్నీ అన్నయ్యా.. నా జోలికొస్తే చాలా చెబుతా.. -వంశీ
X

గన్నవరం ఉదంతంపై చంద్రబాబు రాసిన బహిరంగ లేఖను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తప్పుపట్టారు. చంద్రబాబు ఇంకా రాజనాల కాలం తెలివితేటలను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన బాధను ప్రపంచ బాధగా చూపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. తాను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో కోర్సు చేస్తున్నానని అందుకే కొద్దిరోజుల పాటు అక్కడి వెళ్తున్నానని వంశీ చెప్పారు. తమ కుల పత్రికలు చాలా బాధతో ఉన్నాయని అందుకే ఏదేదో రాస్తున్నాయని విమర్శిస్తున్నారు.

పట్టాభి రాజమండ్రి స్కూల్‌ ఆఫ్ సెంట్రల్‌ జైలుకు, చంద్రబాబు రాజనాల స్కూల్ ఆఫ్ ఓల్డ్ విలన్స్ కు వెళ్తున్నారని.. తాను బిజినెస్ స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పారు. లోకేష్‌కు మాత్రమే మీసం ఉందా..? అని ప్రశ్నించారు. లోకేష్‌కు గురించి తనకు మొత్తం తెలుసన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉండటం దౌర్భాగ్యమన్నారు. అచ్చెన్నాయుడు గురించి తనకు చాలా తెలుసన్నారు.

ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆమెతో మిస్‌ బిహేవ్ చేసిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని అన్నారు. గట్టి చెట్నీ వేసుకుని తింటూ ఉండక తనను విమర్శించడం ఎందుకని వంశీ ప్రశ్నించారు. గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలే ఇలా తయారయ్యాయని.. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోజాను అసెంబ్లీలో ఎలా బూతులు తిట్టించారో అందరూ చూశారన్నారు.

First Published:  23 Feb 2023 7:42 AM GMT
Next Story