Telugu Global
Andhra Pradesh

పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధం..

ఓట్లు వేసిన ప్రజలను వంచించిన‌ చేసిన మోసగాడు చంద్రబాబని మంత్రి రోజా విమర్శించారు. పచ్చ ఛానళ్ల ద్వారా చంద్రబాబు విషం చిమ్ముతున్నాడని ఆమె మండిపడ్డారు.

పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధం..
X

పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా సిద్ధమని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టంచేశారు. తిరుపతిలో సోమవారం మంత్రి రోజా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో నాన్‌ లోకల్‌ పొలిటీషియన్‌లను ప్యాక్‌ చేసి హైదరాబాద్‌కు పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికంగా సీట్లు గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తామని ఆమె చెప్పారు.

ఓట్లు వేసిన ప్రజలను వంచించిన‌ చేసిన మోసగాడు చంద్రబాబని మంత్రి రోజా విమర్శించారు. పచ్చ ఛానళ్ల ద్వారా చంద్రబాబు విషం చిమ్ముతున్నాడని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడే మాటలు గమనిస్తే.. ఫ్రస్ట్రేషన్‌కు పరాకాష్టగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయిన దొంగ చంద్రబాబని రోజా చెప్పారు. ఆయన ఇప్పుడు తమ పార్టీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

షర్మిల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మంత్రి రోజా చెప్పారు. ఆమె వేసుకున్న డ్రెస్‌ కాంగ్రెస్‌దని, స్క్రిప్ట్‌ చంద్రబాబుదని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి, కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిలకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని చెప్పారు.

First Published:  29 Jan 2024 9:18 AM GMT
Next Story